తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్ల రక్షణ కోసం ప్రత్యేక బస్సులు కొనుగోలు

పుల్వామా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతోంది కేంద్రం. 30 మంది ప్రయాణించేందుకు వీలు కలిగిన బుల్లెట్​ ప్రూఫ్​​ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సీఆర్పీఎఫ్​ డైరెక్టర్​ భట్నాగర్​ తెలిపారు.

By

Published : Mar 26, 2019, 6:49 AM IST

పుల్వామా

పుల్వామా ఘటన అనంతరం జవాన్ల భద్రతపై చర్యలు చేపట్టింది కేంద్రం. 30 మంది ప్రయాణించే వీలుతో, ల్యాండ్​మైన్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు సీఆర్పీఎఫ్​ డెరైక్టర్​ జనరల్​ భట్నాగర్​ ప్రకటన విడుదల చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించే బాంబ్​ డిటెక్షన్​ పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

బుల్లెట్​ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. బుల్లెట్​ ప్రూఫ్​ ఉన్న పెద్ద బస్సుల లభ్యత తక్కువ. వాటి తయారీ కష్టం. అందుకే 30 మంది ప్రయాణించటానికి అనువుగా ఉండే చిన్న బస్సుల వైపు మొగ్గు చుపాం.- భట్నాగర్​, సీఆర్పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​

సీఆర్పీఎఫ్​ బలగాల వద్ద బుల్లెట్​ ప్రూఫ్​ వాహనాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నక్సల్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతంలోనూ, మిగతా వాటిని జమ్ముకశ్మీర్​లో వినియోగిస్తున్నారు. వీటిలో నలుగురు మాత్రమే ప్రయాణించటానికి వీలుంది.

అయితే ఈ వాహనాలు తీవ్రవాదుల కాల్పుల నుంచి మాత్రమే జవాన్లను రక్షించగలవు. పుల్వామా లాంటి దాడుల నుంచి కాపాడలేవని సీనియర్​ సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దాడుల నుంచి తప్పించుకోవటానికి సమగ్ర విధానం ఒకటి రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

సమగ్ర విధానమిదే

⦁ జవాన్ల వాహనాలు ప్రయాణించే సమయంలో ఆ ప్రాంతంలో సాధారణ పౌరుల గమనంపై నిషేధం.

⦁ జవాన్ల వాహనాల హాల్టింగ్​ పాయింట్లు తరచుగా మార్చటం.

ABOUT THE AUTHOR

...view details