తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి

కర్ణాటక బీదర్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.

By

Published : Jun 26, 2019, 11:57 AM IST

ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. కర్ణాటకలోని బీదర్​ జిల్లా బసవకల్యాణ పట్టణం చిల్లా కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పాటు నలుగురు పిల్లలు ఈ ఘటనలో మరణించారు.

ఇంటి పైకప్పు కూలిన సందర్భంలో ఘటన స్థలంలోనే తల్లిదండ్రులు మరణించారు. తీవ్ర గాయాలైన పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో మృతి చెందారు.

మృతుల వివరాలు : నదీమ్​ షేక్​(45) ఆయన భార్య ఫరీదా బేగం(34), పిల్లలు అయూశా భాను(15), మెహతాబీ(14), ఫజన్అలీ(5).

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్​ప్రెస్

ABOUT THE AUTHOR

...view details