తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ భద్రతపై హోంమంత్రి అమిత్​షా సమీక్ష

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జమ్ముకశ్మీర్ లో పర్యటించారు అమిత్ షా. ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర భద్రతపై సమీక్షించారు.

By

Published : Jun 26, 2019, 10:50 PM IST

Updated : Jun 27, 2019, 12:05 AM IST

కశ్మీర్​ భద్రతపై హోంమంత్రి అమిత్​షా సమీక్ష

కశ్మీర్​ భద్రతపై హోంమంత్రి అమిత్​షా సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ లో పర్యటించారు. రాష్ట్ర భద్రతా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కశ్మీర్​ ప్రస్తుత స్థితిని అధికారులు షాకు వివరించారు. ఈ భేటీలో జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కశ్మీర్ భద్రతా వ్యహరాల సలహాదారు కె. విజయ్ కుమార్, భద్రతా కార్యదర్శి రాజీవ్ గౌబ, సైన్య ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

పుల్వామా ఘటన అనంతరం కశ్మీర్​లో ఉగ్రవాద సంస్థల నాయకులను ఏరివేసేందుకు తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. మళ్లీ పుల్వామా తరహా దాడులు జరగే వీలు లేకుండా భద్రతా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందించారు.

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనకు కశ్మీర్​ను ఎంచుకున్నారు షా. 27న కూడా కశ్మీర్​లోనే పర్యటిస్తారు.

షాకు స్వాగతం పలికిన గవర్నర్

ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఇతర అధికారులతో కలిసి హోంమంత్రికి విమనాశ్రయం వరకూ వచ్చి స్వాగతం పలికారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. గతంలో ప్రధానికి మాత్రమే ఇలా స్వాగతం పలికేవారు.

అమర్​నాథ్ యాత్ర భద్రతపైనా సమీక్ష

జులై 1న ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లను షాకు వివరించారు అధికారులు. యాత్ర ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు అమిత్​షా.

ఇదీ చూడండి: భారత్​లో పెళ్లితంతు రూటు మార్చుకుంది!

Last Updated : Jun 27, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details