తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ, షాలకు క్లీన్​చిట్​పై ఈసీ ఉత్తర్వుల వివరాలివ్వండి'

నరేంద్ర మోదీ, అమిత్​ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం ఇచ్చిన క్లీన్​చిట్​ ఆదేశాల రికార్డులను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్​ను ఆదేశించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

By

Published : May 6, 2019, 1:11 PM IST

Updated : May 6, 2019, 2:19 PM IST

'మోదీ, షాలకు క్లీన్​చిట్​పై ఈసీ ఉత్తర్వుల వివరాలివ్వండి'

'మోదీ, షాలకు క్లీన్​చిట్​పై ఈసీ ఉత్తర్వుల వివరాలివ్వండి'

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షాకు ఈసీ క్లీన్​చిట్​ ఆదేశాల రికార్డులను సమర్పించాలని పిటిషనర్​ను ఆదేశించింది సుప్రీంకోర్టు. వారిద్దరిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్​ ఎంపీ సుస్మితా దేవ్​ దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ దీపక్​ గుప్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు సుస్మిత తరఫు న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ. సాయుధ దళాలను ఎన్నికల్లో ప్రచారాంశాలుగా వినియోగిస్తూ మోదీ-షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్​ ఫిర్యాదులను ఎలాంటి కారణాలు లేకుండానే ఈసీ కొట్టివేసిందని పేర్కొన్నారు. ఈసీ చర్య వివక్షకు సంకేతమని ఆరోపించారు.

వాదనలు విన్న ధర్మాసనం... ఈసీ జారీ చేసిన ఆదేశాలతో కూడిన మరో అఫిడవిట్​ దాఖలు చేయాలని పిటిషనర్​కు సూచించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

మహారాష్ట్రలోని లాతుర్​లో ఎన్నికల ప్రచారంలో మోదీ సాయుధ దళాలను ప్రస్తావించారు. తొలిసారి ఓటర్లు... తమ ఓటును బాలాకోట్​ దాడుల వీరులకు, పుల్వామా అమరులకు అంకితం ఇవ్వాలని పిలుపునిచ్చారు. వార్దా బహిరంగ సభలో... వయనాడ్​లో మైనార్టీ ఓటర్లు ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ రెండింటిపై కాంగ్రెస్​ ఫిర్యాదు చేయగా... మోదీకి ఈసీ సచ్ఛీలత పత్రం ఇచ్చింది.

ఇదీ చూడండి: సీజేఐపై 'కుట్ర': సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన

Last Updated : May 6, 2019, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details