తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ప్రభుత్వం భేష్....సైన్యానిది అద్భుత జోష్"

ఉత్తర్​ప్రదేశ్​ గాల్వియర్​లో ఆర్​ఎస్​ఎస్​ అఖిల భారతీయ ప్రతినిధుల సభ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల ముందు కీలకాంశాలపై చర్చలు సాగుతున్నాయి.

By

Published : Mar 8, 2019, 6:57 PM IST

Updated : Mar 8, 2019, 7:43 PM IST

ఉత్తర్​ప్రదేశ్

అఖిల భారతీయ ప్రతినిధుల సభ

పాకిస్థాన్​లోని తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత వైమానిక దళంపై ప్రశంసల వర్షం కురిపించింది ఆర్​ఎస్​ఎస్​. మెరుపుదాడులకు అనుమతిస్తూ సరైన నిర్ణయం తీసుకుందంటూ మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.

ఉత్తర్​ప్రదేశ్​ గాల్వియర్​లో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధుల సభ మొదటి రోజు ఈ మేరకు తీర్మానం చేసింది ఆర్​ఎస్​ఎస్​. పాకిస్థాన్​ యుద్ధ విమానాలతో ప్రాణాలకు తెగించి పోరాడిన అభినందన్​ను ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించింది.

తీవ్రవాదులతో పోరాటానికి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొంది. భారత ప్రజలు ఇలాంటి దేశ దోహ్రుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. -ఆర్​ఎస్​ఎస్​

భారత దేశ సహనాన్ని చేతకానితనంగా పరిగణించకూడదని హెచ్చరించింది ఆర్​ఎస్​ఎస్​.

శబరిమల వివాదంపై...

శబరిమల వివాదంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అన్యమతస్థులను ఆలయంలోకి పంపి హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని ఆర్​ఎస్​ఎస్​ ఆరోపించింది.

రామ మందిరానికి ఏకాభిప్రాయం:

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆర్​ఎస్​ఎస్​ ధీమా వ్యక్తంచేసింది.

పర్యావరణ అంశాలపై చర్చ:

ఈ మూడు రోజుల చర్చల్లో రాజకీయ అంశాలతో పాటు పర్యావరణ అంశాలైన నీటి పొదుపు, ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించటం, మొక్కల పెంపకంపై చర్చించనున్నారు.

అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశానికి ఆర్​ఎస్​ఎస్​ అధ్యక్షుడు మోహన్​ భగత్​ సహా 1400 మంది సభ్యులు హజరయ్యారు.

Last Updated : Mar 8, 2019, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details