తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 4:57 AM IST

ETV Bharat / bharat

ముంబయిలో స్థానిక రైళ్ల సేవల విస్తరణ.. వారికే అనుమతి

మహారాష్ట్ర ముంబయిలో బుధవారం నుంచి స్థానిక రైళ్ల సేవలను విస్తరించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ తెలిపారు. సెంట్రల్​, పశ్చిమ రైల్వే జోన్లలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నిత్యావసర సేవల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తారు.

Rlys to expand Mumbai local services but not for general passengers
ముంబాయిలో స్థానిక రైళ్ల సేవలు విస్తరణ

మహారాష్ట్ర ముంబయిలో స్థానికంగా నడుస్తున్న రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ తెలిపారు. సెంట్రల్ రైల్వే జోన్​లో మరో 150, పశ్చిమ రైల్వే జోన్​లో మరో 148 రైళ్లు పెంచనున్నారు. వీటితో ఒక్కో జోన్​ నుంచి 350 రైళ్ల సేవలు అందించనున్నారు. ఈ రైళ్లు కేవలం పెద్ద స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని గోయల్​ చెప్పారు.

వారికి మాత్రమే అనుమతి..

ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నిత్యావసర సేవల సిబ్బంది, కేంద్ర, ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్​, పోస్టల్​, జాతీయ బ్యాంకుల సిబ్బంది, ముంబయి పోర్టు ట్రస్టు, న్యాయ, రక్షణ, రాజ్​ భవన్ ఉద్యోగులు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు గోయల్​.

ఇదీ చూడండి:పాక్ కుట్ర భగ్నం- ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details