తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యడ్డీ ప్రమాణం తర్వాతే బెంగళూరుకు రెబల్స్!

కర్ణాటక శాసనసభకు రాజీనామా చేసిన 15మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం అనంతరమే బెంగళూరుకు చేరుకోనున్నారు.

By

Published : Jul 24, 2019, 5:45 AM IST

యడ్డీ ప్రమాణం తర్వాతే ముంబయి నుంచి ఎమ్మెల్యేలు

కర్ణాటక గత ప్రభుత్వంపై అసమ్మతితో రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలు నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం తర్వాతే తిరిగి బెంగళూరుకు చేరుకోనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణం కూలిపోవడంపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారని సమాచారం. అసమ్మతి ఎమ్మెల్యేలు ఏం కోరుకున్నారో అదే జరిగిందని కర్ణాటకకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేసి రాజీనామాలు చేసినప్పుడు తమ వెనక భాజపా లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

'4 వారాల సమయమివ్వండి'

కాంగ్రెస్-జేడీఎస్ కూటమిపై అసమ్మతితో రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలు తన ఎదుట హాజరు కావాలన్న స్పీకర్ ఆదేశాలపై ఆయా శాసన సభ్యులు 4 వారాల గడువు కోరారు. వారి తరఫు న్యాయవాది ద్వారా ఈ సమయాన్ని కోరినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'అక్రమ మార్గంలో అధికారంలోకి భాజపా'

ABOUT THE AUTHOR

...view details