తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2047 వరకు భాజపాదే అధికారం: రాం​ మాధవ్​

అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగి, గతంలో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును నరేంద్ర మోదీ తిరగరాస్తారని వ్యాఖ్యానించారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్​. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లు పూర్తయ్యేవరకు భాజపానే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

By

Published : Jun 8, 2019, 11:13 AM IST

2047 వరకు భాజపాదే అధికారం: రాం​ మాధవ్​

దేశంలో సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన రికార్డును నరేంద్రమోదీ బద్దలుకొడతారని జోస్యం చెప్పారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్​. త్రిపుర రాజధాని అగర్తలాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భాజపాకు ఇప్పట్లో ఎదురులేదంటూ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు రాం మాధవ్​.

సమావేశంలో మాట్లాడుతున్న రాం మాధవ్​

"ప్రస్తుత ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగుతుంది. మీకు చరిత్ర గుర్తు చేస్తున్నా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 నుంచి 1977 వరకు 27ఏళ్ల పాటు కాంగ్రెస్​ అధికారంలో ఉంది. సుదీర్ఘ కాలం పదవి చేపట్టి కాంగ్రెస్​ రికార్డు నెలకొల్పింది. మోదీ ఆ రికార్డునూ బద్దలు కొడతారు. భాజపా అధికారంలోనే వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలను 2047లో జరుపుకుంటాం."
-రాం మాధవ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.

ఇదీ చూడండి: గురువాయూర్​ ఆలయంలో మోదీ పూజలు

ABOUT THE AUTHOR

...view details