తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దక్షిణ కొరియా రక్షణమంత్రితో రాజ్​నాథ్ భేటీ

రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ దక్షిణ కొరియా రక్షణ మంత్రి జియాంగ్ కియాంగ్​డూతో సమావేశమయ్యారు. మూడు రోజులుగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన రక్షణ రంగంలో పరస్పర సహకారానికి సంబంధించి విస్తృత చర్చలు జరిపారు. రక్షణ, విద్య, నావికాదళాల మధ్య సమాచార మార్పిడికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

By

Published : Sep 6, 2019, 1:29 PM IST

Updated : Sep 29, 2019, 3:32 PM IST

దక్షిణ కొరియా రక్షణమంత్రితో రాజ్​నాథ్ భేటీ

మూడు రోజులుగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం పెంపొందించే దిశగా నేడు ఆ దేశ రక్షణమంత్రి జియాంగ్ కియాంగ్​డూతో భేటీ అయ్యారు. రక్షణ ఉత్పత్తుల సంయుక్త తయారీ, ఇరుదేశాల నావికాదళాల మధ్య పరస్పర సహకారం దిశగా చర్చలు జరిపారు.

రక్షణ విభాగంలో ద్వైపాక్షిక సహకారం కోసం ఇద్దరు మంత్రులు విస్తృతంగా చర్చలు జరిపారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇరు దేశాల మధ్య రక్షణ విద్య, నావికాదళాల మధ్య సమాచార మార్పిడికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం

Last Updated : Sep 29, 2019, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details