తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు అహ్మదాబాద్ కోర్టుకు రాహుల్ గాంధీ

పరువునష్టం కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ... నేడు గుజరాత్​లోని అహ్మదాబాద్ మేజిస్ట్రేట్​ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ ఈ దావా దాఖలు చేశారు.

By

Published : Jul 12, 2019, 5:25 AM IST

Updated : Jul 12, 2019, 7:51 AM IST

నేడు అహ్మదాబాద్ కోర్టుకు రాహుల్ గాంధీ

నేడు అహ్మదాబాద్ కోర్టుకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ.... తనపై దాఖలైన పరువునష్టం దావా విచారణ నిమిత్తం ఇవాళ గుజరాత్​లోని​ అహ్మదాబాద్​ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్​ కోర్టు ఎదుట హాజరుకానున్నారు.

రాహుల్​గాంధీపై... అహ్మదాబాద్ జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంక్(ఏడీసీ) ఛైర్మన్​ అజయ్​ పటేల్​ గతేడాది ఈ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోసం రాహుల్ నేడు స్వయంగా హాజరుకానుండగా, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్​సింగ్​ సుర్జేవాలా శనివారం విచారణకు హాజరవుతారని... గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్​ దోషి తెలిపారు.

ఇదీ జరిగింది..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా గతంలో.. అహ్మదాబాద్​ జిల్లా సహకార బ్యాంకుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016 నవంబర్ 8న నోట్లరద్దు ప్రకటించిన ఐదు రోజుల్లో.... రూ.745.59 కోట్ల విలువైన చెల్లుబాటు అయ్యే నోట్లను మార్పిడి చేసి ఈ బ్యాంకు కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.

ముంబయికి చెందిన ఓ కార్యకర్త ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్​ రూరల్ డెవలప్​మెంట్ ఇచ్చిన సమాధానం ఆధారంగానే రాహుల్ గాంధీ, సుర్జేవాలా... ఏడీసీ బ్యాంకుపై ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఏడీసీ బ్యాంకుతో పాటు ఛైర్మన్ అజయ్​ పటేల్ వ్యక్తిగతంగా​.... ఈ ఇరువురు నేతలపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఈ ఏడీసీ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.

ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ఏప్రిల్ 9న రాహుల్​గాంధీ, రణ్​దీప్​​ సుర్జేవాలాలకు సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి: వైరల్​: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా

Last Updated : Jul 12, 2019, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details