తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దేశ భద్రతను ప్రమాదంలో పెట్టారు"

రఫేల్​ ఒప్పందం తీర్పు పునఃసమీక్ష పిటిషన్లపై సుప్రీంకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. రహస్య పత్రాల బహిర్గతంతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పింది.

By

Published : Mar 13, 2019, 10:15 PM IST

సుప్రీం కోర్టుకు అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం

రఫేల్​ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాలు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతాయని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్​ దాఖలు చేసింది. కుట్ర పూరితంగా పత్రాల నకలుకు పాల్పడిన వారు నేరానికి పాల్పడినట్టేనని పేర్కొంది. పత్రాలను బహిర్గతం చేసి జాతీయ భద్రతను ప్రమాదంలో పెట్టారని తెలిపింది.

రఫేల్​ పత్రాల లీకేజ్​పై ఫిబ్రవరి 28 నుంచివిచారణ చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్​ మిత్రా తెలిపారు. లీకేజీ ఎక్కడి నుంచి ​జరిగిందో తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోందని తెలిపారు. పత్రాలు సమర్పించిన పిటిషనర్లు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్​ సిన్హా, అరుణ్​ శౌరీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​లు... శత్రువులు, విరోధుల చేతుల్లో యుద్ధవిమానాల పత్రాలను పెట్టారని ఆరోపించారు.

రఫేల్​ పత్రాలు మాయమైన విషయానికి ప్రాధాన్యతనిచ్చింది అఫిడవిట్​. పత్రాలు చోరీకి గురయ్యాయని మార్చి 6న సుప్రీంకు తెలిపారు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. రెండు రోజుల తర్వాత అవి భద్రంగానే ఉన్నాయని చెప్పారు. పిటిషనర్లు ఒరిజినల్​ పత్రాల నకలును దరఖాస్తులో చేర్చారని అఫిడవిట్​ తెలిపింది.

జాతీయ భద్రతపై అంశాలను, కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతామని ఫ్రాన్స్​తో ఒప్పందం చేసుకున్నామని అఫిడవిట్​లో పేర్కొంది రక్షణ శాఖ. కేంద్రం గోప్యతను పాటిస్తున్నప్పటికీ సిన్హా, శౌరీ, భూషణ్​ పత్రాలను స్వాధీనం చేసుకుని ఒప్పందాన్ని అవమానించారని పేర్కొంది. వారు అనధికారికంగా పత్రాలను పొందారని ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details