తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా రాజీనామా!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా ఆ పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు. మరో రెండు వారాల పాటు కొనసాగాలన్న మోదీ అభ్యర్థన మేరకు ఆయన గడువు తీరిన అనంతరం పదవి బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశం ఉంది. కేబినెట్ కార్యదర్శిగా పదవి విరమణ పొందిన పీకే సిన్హా ప్రధాని కార్యాలయ ఓఎస్​డీగా నియమితులయ్యారు.

By

Published : Aug 30, 2019, 10:26 PM IST

Updated : Sep 28, 2019, 10:03 PM IST

ప్రధాని ముఖ్య కార్యదర్శి పదవికి నృపేంద్ర మిశ్రా రాజీనామా!

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యకార్యదర్శిగా గత ఐదేళ్లుగా సేవలందిస్తున్న నృపేంద్ర మిశ్రా పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మరో రెండు వారాల పాటు కొనసాగాలన్న ప్రధాని అభ్యర్థన మేరకు... గడువు ముగిసిన అనంతరం ఆయన బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. కేబినెట్ సెక్రటరీగా నేడు పదవి విరమణ పొందిన పీకే సిన్హాను ప్రధానమంత్రి కార్యాలయ ఓఎస్​డీగా నియమించారు.

1967 బ్యాచ్​కు చెందిన నృపేంద్రమిశ్రా ఉత్తరప్రదేశ్​ కేడర్​కు చెందిన ఐఏఎస్ అధికారి. మిశ్రా భావిజీవితం ఆనందకరంగా సాగాలని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

"2014లో నేను దిల్లీకి కొత్తగా వచ్చినప్పుడు ఆయనే వివిధ అంశాలపై దిక్సూచీ అయ్యారు. ఆయన సూచనలు ఎంతో విలువైనవి... గత ఐదేళ్లుగా ఎంతో అంకిత భావంతో పనిచేసి... భారత అభివృద్ధిపై చెరగని ముద్రవేశారు. నూతన జీవితాన్ని ప్రారంభించనున్న మిశ్రాకు నా శుభాకాంక్షలు."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

మోదీ సారథ్యంలో దేశాభివృద్ధికి కృషి చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు నృపేంద్ర మిశ్రా. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిశ్రా.. ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల కనిష్ఠానికి దేశ వృద్ధి రేటు.. 5 శాతంగా నమోదు

Last Updated : Sep 28, 2019, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details