తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంత రాష్ట్రానికి మోదీ

నేడు, రేపు గుజరాత్​లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ తొలిదశ మెట్రోను ప్రారంభించనున్నారు. శ్రమయోగి మాన్​ధన్​ పథకానికి శ్రీకారం చుడతారు.

By

Published : Mar 4, 2019, 6:48 AM IST

నరేంద్ర మోదీ

రెండు రోజుల పాటు తన సొంత రాష్ట్రమైన గుజరాత్​లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​లో మొదటిదశ మెట్రోసేవలను ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా శ్రమయోగి మాన్​ధన్​ పథకానికి శ్రీకారం చుడతారు. రాష్ట్రంలో పలు చోట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు.

జామ్​నగర్​ నుంచి మొదలు

రెండు రోజుల పర్యటనను సౌరాష్ర్ట ప్రాంతంలోని జామ్​నగర్​ నుంచి ప్రారంభించనున్నారు నరేంద్ర మోదీ. అక్కడ 750 పడకల గురుగోవింద్​ ఆసుపత్రిని ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రారంభిస్తారు.

జామ్​నగర్​​లోనే రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. అలాగే బంద్రా-జామ్​నగర్...​ హంసఫర్​ ఎక్స్​ప్రెస్​ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అహ్మదాబాద్​లోని ఉమియాధామ్​ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ భవన సముదాయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.

ఆ తర్వాత 28.28 కిలోమీటర్ల అహ్మదాబాద్​ రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేస్తారు. తొలి దశ మెట్రో ప్రారంభించి...అందులో ప్రయాణిస్తారు. మహిళా, శిశు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్​ ఆసుపత్రి, కంటి, దంత ఆసుపత్రులను ప్రారంభించనున్నారు మోదీ.

శ్రమ్​యోగి మాన్​ధన్​కు శ్రీకారం

రెండో రోజు పర్యటనలో భాగంగా గాంధీనగర్​లోని అదలాజ్​లో ఉన్న అన్నపూర్ణధామ్​ ట్రస్టులో శిక్షణ్​, విద్యార్థి భవన్​లకు మోదీ మంగళవారం శంకుస్థాపన చేస్తారు.

అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్​ సదుపాయాన్ని కల్పించే శ్రమ్​యోగి మాన్​ధన్​ పథకాన్ని వస్త్రల్​లో ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. కొందరు లబ్ధిదారులకు పింఛన్​కార్డులను అందిస్తారు. ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులు రూ.3వేల నెలసరి పింఛన్​ పొందుతారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఈ పథకాన్ని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details