తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నయా జోష్​తో కలిసి పనిచేద్దాం: మోదీ

ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది అంకితభావాన్ని మోదీ కొనియాడారు. విధి నిర్వహణలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఐదేళ్లలో నూతన ఉత్తేజంతో ముందడుగు వేద్దామని సిబ్బందికి పిలుపునిచ్చారు.

By

Published : May 25, 2019, 1:47 PM IST

నయా జోష్​తో కలిసి పనిచేద్దాం: మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సిబ్బందితో సమావేశమయ్యారు. అంకితభావంతో విధులు నిర్వర్తించారని సిబ్బందిని మోదీ అభినందించారు.

'ధన్యవాదాలు'

"మీ అందరికీ ధన్యవాదాలు. ప్రధాని విజయం సాధించారని దేశంతో పాటు ప్రపంచమూ అనుకుంటుంది. సామాన్యుల్లో ఆశ, మార్పు పెంచడం కోసం జరిగిన ఐదేళ్ల కఠోర సాధనకు ప్రధానిని మెచ్చుకుంటారు. టీవీ, పత్రికల్లోనూ ప్రధానే కనపడతారు. శుభాకాంక్షలు కూడా ప్రధాని ఖాతాలోనే పడతాయి. కానీ అంకితభావమున్న బృందం లేకపోతే... ఎన్ని కలలు కన్నా ఫలితం దక్కదు. ప్రధాని- సిబ్బంది ఆలోచనలు కలిస్తేనే ఫలితం దక్కుతుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

నూతన ఉత్సాహం, ఉత్తేజంతో రెండోసారి మరింత మెరుగ్గా పనిచేయాలని పీఎంఓ సిబ్బందికి మోదీ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: కారుపై 'పేడ కోటింగ్​'... చల్లటి ఐడియా​ గురూ!

ABOUT THE AUTHOR

...view details