తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు వాజ్​పేయీ ప్రథమ వర్ధంతి- ప్రముఖుల నివాళి

దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ ప్రథమ వర్ధంతి సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సహా పలువురు భాజపా నేతలు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మహా నేత సేవలను స్మరించుకున్నారు.

By

Published : Aug 16, 2019, 8:34 AM IST

Updated : Sep 27, 2019, 3:57 AM IST

నేడు వాజ్​పేయీ ప్రథమ వర్ధంతి- మోదీ నివాళి

నేడు వాజ్​పేయీ ప్రథమ వర్ధంతి- మోదీ నివాళి

నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ ప్రథమ వర్ధంతి. మహా నేతకు నివాళులర్పించడానికి భాజపా అగ్రనేతలు దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్'కు తరలి వెళ్తున్నారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సదైవ్​ అటల్​కు చేరుకొని వాజ్​పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Last Updated : Sep 27, 2019, 3:57 AM IST

ABOUT THE AUTHOR

...view details