తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2020, 2:51 PM IST

ETV Bharat / bharat

గుజరాత్​లో 'ఆరోగ్య వన్'​ ప్రారంభించిన మోదీ

గుజరాత్​లోని నర్మదా జిల్లాలో ఔషధ మొక్కల వనమైన 'ఆరోగ్య వన్'ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ దేవ్​రథ్​, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు.

Modi inaugurates 'Arogya Van' in Gujrat
ఆరోగ్య వన్​ను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్​లో 'ఆరోగ్య వన్​' అనే ఔషధ మొక్కలు, మూలుకల వనాన్ని శుక్రవారం ప్రారంభించారు. గుజరాత్ పర్యటలనో భాగంగా.. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వనాన్ని మోదీ సందర్శించారు.

అరోగ్యవన్​లో మోదీ పర్యటన
డిజిటల్ ఇన్​ఫర్మేషన్ సెంటర్​లో మోదీ

17 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరోగ్య వన్​లో.. మానవాళి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వనంలో ఎంపిక చేసిన 380 జాతుల మొక్కలను పెంచినట్లు చెప్పారు. మొక్కల ప్రత్యేకత, ఔషధ గుణాలను తెలుసుకునేందుకు వీలుగా వాటికి సంబంధించిన వివరాలను బోర్డులపై రాసి సందర్శకులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

మొక్కల సమాచారంతో ఏర్పాటు చేసిన బోర్డు

ఆరోగ్య వన్​లో లోటస్ పాండ్, యోగా కేంద్రం, ఇండోర ప్లాంట్ విభాగం, అల్బా గార్డెన్, డిజిటల్ ఇన్ఫర్మెషన్ వంటివి ఉన్నాయి.

ఇదీ చూడండి:కేశూభాయ్'​ కుటుంబసభ్యులకు మోదీ పరామర్శ

ABOUT THE AUTHOR

...view details