తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కార్మిక వర్గాలకు వరాల జల్లు'

బడ్జెట్​లో కార్మిక వర్గాలకు కేంద్రం వరాలు. గ్రాట్యుటీ పరిమితి పెంపుతో పాటు, కార్మిక బీమా రూ. 6 లక్షలకు పెంపు

By

Published : Feb 1, 2019, 2:33 PM IST

వరాల జల్లు

'కార్మిక వర్గాలు
ఊహించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర బడ్జెట్​లో వరాల జల్లు కురిపించింది. కార్మికుల ప్రమాదబీమా పెంపుతో పాటు, కనీస వేతనం ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఈఎస్​ఐ పరిధినీ పెంచింది.

'గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లలోనే అన్ని వర్గాల కార్మికుల వేతనాలు 42 శాతం పెరిగాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈఎస్​ఐ పరిధిని రూ. 15 వేల నుంచి 21 వేలకు పెంచాం. ప్రతి కార్మికునికి కనీస పింఛను వెయ్యి రూపాయలు. సర్వీసులోనే మృతి చెందితే ఈపీఎఫ్​వో ద్వారా ఆర్థికసాయం కింద రూ. 2 లక్షల 50 వేల నుంచి 6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.'

- పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details