తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2019, 6:06 AM IST

Updated : Aug 10, 2019, 7:25 AM IST

ETV Bharat / bharat

'ఇతరుల అంతర్గత విషయాలు పాక్​కు అనవసరం'

ఇతర దేశాల అంతర్గత విషయాలు పాకిస్థాన్ కు అనవసరమని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాక్​ వాస్తవాన్ని అంగీకరించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్​ సూచించారు.

'ఇతరుల అంతర్గత విషయాలు పాక్​కు అనవసరం'

'ఇతరుల అంతర్గత విషయాలు పాక్​కు అనవసరం'

కశ్మీర్​ తమ అంతర్గత విషయమనీ, అందులో పాకిస్థాన్​ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది భారత్​. వాస్తవాలను పాక్​ అంగీకరించతప్పదని తేల్చి చెప్పింది. ఇతర దేశాలకు కశ్మీరు అంశంపై భారత్​ వివరిస్తోంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ స్పందించారు.

"కశ్మీరుపై వాస్తవాన్ని పాకిస్థాన్ అంగీకరించాలి. ఈ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడం మానుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలపై అత్యంత భయానక దృశ్యాన్ని చూపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. జమ్ముకశ్మీరులో అభివృద్ధి జరిగితే.. అప్పుడెవరినీ మభ్యపెట్టలేమని పాక్​ భావిస్తోంది. అందుకే కశ్మీర్ విషయంలో భారత్​ నిర్ణయంపై పాక్​ నైరాశ్యంతో ఉంది."

- రవీశ్​ కుమార్​, భారత విదేశాంగ శాఖ

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత పాక్​ తీసుకున్న చర్యలన్నీ ఏకపక్షమేనని స్పష్టం చేశారు.

"భారత్ చేపట్టిన చర్యలన్నీ కశ్మీర్​ ప్రయోజనాల కోసమే. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును పాకిస్థాన్ నిలిపేయడం దురదృష్టకరం. ఈ నిర్ణయంపై భారత్ విచారం వ్యక్తం చేస్తోంది. పాక్​ పునరాలోచించాలి."

- రవీశ్​ కుమార్​, భారత విదేశాంగ శాఖ

పాక్​ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ దౌత్య సాయంపై ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రవీశ్​ కుమార్​ తెలిపారు. జమ్ము కశ్మీర్​ విభజన, అధికరణ 370 రద్దు వంటి చర్యలు భారత్​ అంతర్గత వ్యవహారాలని ఇతర దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు స్పష్టం చేశామన్నారు.

ఇదీ చూడండి:'భారత్​ వెనక్కితగ్గితేనే సంబంధాల పునఃసమీక్ష'

Last Updated : Aug 10, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details