తెలంగాణ

telangana

రూ.17వేల కోట్లతో 1.4 కోట్ల మందికి ఉచితవైద్యం!

By

Published : Nov 26, 2020, 10:36 PM IST

దేశంలో ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద 1.4 కోట్ల మందికిపైగా పేదలకు నగదు రహిత చికిత్సను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. ఇందుకు రూ.17,500కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు.

Over 1.4 cr cashless treatments provided to poor under Ayushman Bharat: Harsh Vardhan
రూ.17వేల కోట్లుతో 1.4 కోట్ల మందికి ఉచితవైద్యం!

ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద ఇప్పటివరకు రూ.17,500 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికిపైగా పేదలకు నగదు రహిత వైద్య సేవలు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ఈ పథకం కింద 24,653 ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఆసుపత్రిలో నిమిషానికి సగటున 14 ప్రవేశాలు నమోదు అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధాన ఆరోగ్య పరిరక్షణ మిషన్​, నేషనల్​ డిజిటల్​ హెల్త్​ మిషన్​ (ఎన్​డీహెచ్​ఎం) అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడానికి జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థను సందర్శించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు.

ఇదీ చూడండి:'బ్లాక్ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయండి'

ABOUT THE AUTHOR

...view details