తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఛాయ్​వాలా నుంచి చౌకీదార్​'

భాజపా తాజాగా మొదలుపెట్టిన 'నేనూ చౌకీదార్' ప్రచారంపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఛాయ్​వాలా నుంచి చౌకీదార్​గా మోదీ హయాంలో భారత్ సాధించిన పురోగతి అచ్చం ఇలానే ఉందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు.

By

Published : Mar 19, 2019, 6:14 PM IST

Updated : Mar 19, 2019, 9:03 PM IST

నేనూ చౌకీదార్​ పై విపక్షాల దాడి

భాజపా ఎన్నికల ప్రచార వ్యూహాలపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా తాజాగా మొదలు పెట్టిన 'నేనూ చౌకీదార్' ప్రచారంపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఛలోక్తులు విసిరారు.

"నేనూ కాపలదారున్నే​ ప్రచారాన్ని భాజపా మొదలు పెట్టాక మోదీతో ఆ పార్టీ నేతలంతా పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకున్నారు. నరేంద్రమోదీ ఇప్పటి నుంచి చౌకీదారే. గత ఎన్నికల్లో ఛాయ్​వాలా ఇప్పుడు చౌకీదార్​గా మారారు. భాజపా ప్రభుత్వంలో ఎంతమార్పు. అభినందించాల్సిన విషయం!"
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

బీఎస్పీ మిత్రపక్షం సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ సైతం రఫేల్ విషయంలో భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. అభివృద్ధి ప్రశ్నిస్తోందంటూ మోదీకి చురకలంటించారు. వివిధ అంశాలపై వరుస ట్వీట్లలో మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

"మంత్రిత్వ శాఖ నుంచి పత్రాలు మాయమైతే చౌకీదార్​ బాధ్యత వహిస్తారా? అందుకు శిక్ష కూడా ఉంటుంది మరి."
-అఖిలేశ్ యాదవ్. ఎస్పీ అధ్యక్షుడు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ​ప్రియాంక గాంధీ చౌకీదార్​ ఎవరికి అవసరమో వివరిస్తూ మోదీని ఎద్దేవా చేశారు.

" చౌకీదార్​ అని ప్రధాని పేరు ముందు తగిలించుకున్నారు. ఓ రైతు నాతో అన్నారు. ధనవంతులకే కాపలాదారులు ఉంటారు. రైతుల విషయంలో ఎవరికి వారే కాపలాదారులని చెప్పారు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి:మోదీ ధనికులకే చౌకీదార్:ప్రియాంక

Last Updated : Mar 19, 2019, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details