తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2019, 6:57 PM IST

ETV Bharat / bharat

కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం ప్రశ్నార్థకమే?: కుమారస్వామి

కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి... ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ పార్టీ కూడా సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేదని అభిప్రాయపడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలు రాష్ట్రాన్ని ఉపఎన్నికల దిశగా నెట్టివేశాయని, దీనికి భాజపాయే కారణమని అన్నారు.

కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం ప్రశ్నార్థకమే?: కుమారస్వామి

కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేదని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హెచ్​.డి.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. బలపరీక్షలో ఓడి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కాంగ్రెస్- జేడీఎస్​ అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలు... ఉపఎన్నికల దిశగా రాష్ట్రాన్ని నెట్టాయని కుమారస్వామి అన్నారు. ఈ పరిస్థితికి భాజపానే కారణమని విమర్శించారు.

"ప్రస్తుతం...అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి నిలపాలో లేదా 20 నుంచి 25 స్థానాలకు జరిగే ఉపఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితికి భాజపానే కారణం. అయితే ఎన్నికల తరువాత కూడా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించడం లేదు."
-హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి

రామలింగారెడ్డికి కృతజ్ఞతలు

కుమారస్వామి కాంగ్రెస్ నేత రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. రాజీనామా ఉపసంహరించుకుని కాంగ్రెస్-జేడీఎస్​ సంకీర్ణానికి మద్దతు తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

రామలింగారెడ్డి 16మంది రెబల్​ ఎమ్మెల్యేల్లో ఒకరు. అయితే తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుని సంకీర్ణ ప్రభుత్వానికే మద్దతుగా నిలిచారు. కానీ ఫలితం దక్కలేదు.

ఇదీ చూడండి: పార్లమెంట్​ సమావేశాలు ఆగస్టు 7 వరకు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details