తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాన మంత్రికి మినహాయింపు ఉంది: ఈసీ

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ప్రాంతాల సమాచారాన్ని పీఎంవోకు నీతి ఆయోగ్​ ఇవ్వడం ఎలాంటి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కిందికిరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధానమంత్రికి ఈ మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

By

Published : May 13, 2019, 6:04 AM IST

ప్రధానమంత్రికి మినహాయింపు ఉంది: ఈసీ

ప్రధానమంత్రికి మినహాయింపు ఉంది: ఈసీ

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నీతి ఆయోగ్ ఉల్లంఘించలేదని ఈసీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్రాంతాల సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) నీతి ఆయోగ్​ అందించడం నిబంధనలకు విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది.

ప్రధాని ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సమాచారం అందించాల్సిందిగా వివిధ రాష్ట్రాల అధికారులను నీతి ఆయోగ్​ ఆదేశించిందని కాంగ్రెస్ ఆరోపించింది. పీఎంవోకు సమాచారం అందించి నీతి ఆయోగ్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్​కాంత్​కు ఈసీ మే 4న ఓ లేఖ రాసింది.

ప్రధానమంత్రి అధికారిక పర్యటనలకు, ఎన్నికల ప్రచారానికి సమాచారం అందించేలా నిబంధనల మినహాయింపు ఉందని సీనియర్​ డిప్యూటీ ఎన్నికల కమిషనర్​ సందీప్​ సక్సేనా తెలిపారు. అయితే ఈ మినహాయింపు మిగతా మంత్రులకు ఉండదని స్పష్టం చేశారు.

"ప్రధానమంత్రికి ఈ ప్రత్యేక మినహాయింపు 2014 అక్టోబర్​లో ఇచ్చారు. ఈ మినహాయింపు ఒక్కసారికి మాత్రమే కాదు. ఎప్పటికీ ఉంటుంది." - సందీప్​ సక్సేనా, సీనియర్​ డిప్యూటీ ఎన్నికల​ కమిషనర్

పీఎంవోకు నీతిఆయోగ్​ ఎలాంటి రాజకీయ సంబంధమైన సమాచారాన్ని అందించలేదని, జిల్లా స్థాయి సమాచారాన్ని మాత్రమే ఇచ్చిందని ఆధారాలు చెబుతున్నాయి.

భారత వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఓ విభాగానికి చెందిన అధికారి... స్టార్టప్ ఇండియా సమాచారాన్ని పీఎంవోకి ఇచ్చారని, ఇది మేనిఫెస్టోలో భాజపా వాడుకుందని కాంగ్రెస్ తాజాగా మరో ఫిర్యాదు చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని వాణిజ్య మంత్రిత్వశాఖను ఈసీ ఆదేశించింది.

ఇదీ చూడండి: కేంద్రమంత్రి గిరిరాజ్​​కు ఈసీ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details