తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం అనంతరం జమ్ముకశ్మీర్​లో పర్యటిస్తున్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్. షోపియాన్​ జిల్లాలో భద్రతా సిబ్బందితో ముచ్చటించారు. స్థానికులతో మమేకమైన ఢోబాల్ వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.

By

Published : Aug 7, 2019, 7:00 PM IST

జమ్ముకశ్మీర్​లో అజిత్​ ఢోబాల్ పర్యటన

జమ్ముకశ్మీర్​లో అజిత్​ ఢోబాల్ పర్యటన

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ జమ్ముకశ్మీర్​లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ పునర్విభజన బిల్లు అనంతరం క్షేత్రస్థాయి భద్రతా పరిస్థితులను తెలుసుకునే దిశగా డోభాల్ పర్యటన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో భద్రతా సిబ్బందితో ఆయన ముచ్చటించారు. ఆయన వెంట డీజీపీ దిల్బాగ్ సింగ్ ఉన్నారు. షోపియాన్​లోని పౌరులతో మమేకమైన ఢోబాల్ వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details