తెలంగాణ

telangana

ముజఫర్​పుర్​ ఆశ్రమం కేసుపై దర్యాప్తునకు 3 నెలల గడువు

By

Published : Jun 3, 2019, 1:25 PM IST

Updated : Jun 3, 2019, 3:40 PM IST

బిహార్​లోని ముజఫర్​పూర్​ ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తునకు సీబీఐకు 3 నెలల గడువునిచ్చింది సుప్రీం కోర్టు. ఆరు నెలల సమయం కావాలన్న సీబీఐ అభ్యర్థన మేరకు ఈ ఆదేశాలిచ్చింది.

ముజఫర్​పుర్​ ఆశ్రమం కేసుపై దర్యాప్తునకు 3 నెలల గడువు

ముజఫర్​పుర్​ ఆశ్రమం కేసుపై దర్యాప్తునకు 3 నెలల గడువు

బిహార్​లోని ముజఫర్​పుర్​ ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసు విచారణపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు ఆదేశాలిచ్చింది సుప్రీం కోర్టు. హత్యలతో సహా వేధింపులపై దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించింది.

గతంలో ఇచ్చిన గడువును పొడిగించి ఆరు నెలల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సీబీఐ. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్​ ఇందు మల్హోత్రా, జస్టిస్​ ఎంఆర్​ షా లు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది.

లైంగిక వేధింపులతో పాటు కేసుకు సంబంధం ఉన్న బయటివ్యక్తులపైనా దర్యాప్తు చేయాలని సూచించింది. మూడు నెలల్లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

గతంలో..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముజఫర్​పుర్​ కేసును దిల్లీ సాకేత్​ కోర్ట్​ కాంప్లెక్స్​లోని పోక్సో న్యాయస్థానానికి బదిలీ చేసింది సుప్రీం. విచారణ ముగించేందుకు సీబీఐకి 6 నెలలు గడువిచ్చింది. కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను బిహార్​ సీబీఐ కోర్టు రెండు వారాల్లోగా పోక్సో కోర్టుకు అందించాలని తెలిపింది.

బిహార్​లోని ముజఫర్​పుర్​లో ఎన్​జీఓలు నడుపుతున్న ఓ ఆశ్రమంలో చాలా మంది బాలికలు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ దారుణాన్ని టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సోషల్ సైన్సెస్​ (టిఐఎస్​ఎస్​) గత ఏడాది మే నెలలో వెలుగులోకి తెచ్చింది.

ఇదీ చూడండి: సైకిల్​పై వచ్చి... కేంద్ర మంత్రిగా బాధ్యతల స్వీకరణ

Last Updated : Jun 3, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details