తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు దక్షిణాదికి మోదీ

నేడు దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కలబురగి, కంచీపురం ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించనున్నారు.

By

Published : Mar 6, 2019, 6:17 AM IST

నేడు దక్షిణాదికి మోదీ

నేడు దక్షిణాదికి మోదీ

మంగళవారం మధ్యప్రదేశ్​లో ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని మోదీ... నేడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని కలబురగి, తమిళనాడులోని కంచీపురం ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

బెంగళూరులోని ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ టెర్మినల్​ను జాతికి అంకితమిస్తారు. అనంతరం కలబురగిలో ఆయుష్మాన్​ భారత్​ లబ్ధిదారులతో ప్రధాని సంభాషిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

కంచీపురంలో పలు రోడ్డు, రైలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ప్రధాని. వీటితో పాటు కంచీపురం నుంచే చెన్నైలోని జానకి మహిళా కళాశాలలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్​జే రామచంద్రన్​ విగ్రహాన్ని వీడియో లింక్​ ద్వారా ఆవిష్కరిస్తారు.

ABOUT THE AUTHOR

...view details