తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలాంటి వారి తాట తీయండి: మోదీ

కశ్మీర్​ ప్రజలపై జరుగుతున్న దాడుల్ని సమర్థంగా అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.

By

Published : Mar 8, 2019, 5:55 PM IST

కశ్మీరీలపై దాడుల్ని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచన

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్​ ప్రజలపై జరుగుతున్న దాడుల్ని సమర్థంగా అణచివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. లఖ్​నవూలో ఇటీవల జరిగిన దాడులను అల్లరిమూకల పనిగా అభివర్ణించారు. దేశ సమగ్రతను కాపాడటం అత్యవసరమని పేర్కొన్నారు మోదీ.

ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

వైమానిక దాడులపై విపక్షాల ఆరోపణలతో పాక్​కు లాభమన్న మోదీ

"వీరుల త్యాగాల కారణంగా దేశం సురక్షితంగా ఉంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. కానీ కొంతమందికి ఇది దుఃఖం కలిగిస్తోంది. సైన్యం పరాక్రమాన్ని తగ్గించి చూపేందుకు రాత్రి పగలూ అనే భేదం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్​కు సంతోషం కలిగించే వ్యాఖ్యల్ని చేస్తున్న వారిని క్షమించొచ్చా.. ఇది సైన్యానికి, వీరుల పరాక్రమానికి అవమానం కాదా? రాజకీయ స్వార్థం కోసం విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వారు ఉపయోగిస్తున్న భాష కారణంగా పాకిస్థాన్​కు బలం చేకూరుతోంది."-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details