తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'

దేశ భద్రత ఎన్నికల అంశమెందుకు కాదని నిలదీశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు పోతున్నా మహాకూటమి నేతలు దేశ భద్రత ఎన్నికల అంశమే కాదనడం సరికాదని  విమర్శించారు. బిహార్​లోని పాలిగంజ్​లో ఎన్నికల ప్రచారం చేశారు మోదీ.

By

Published : May 15, 2019, 12:43 PM IST

Updated : May 15, 2019, 5:13 PM IST

'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'

'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'

ఉగ్రవాద నిర్మూలనకు తమ ప్రభుత్వం అనుసరించిన దూకుడు విధానమే సరైన మార్గమని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు పోతున్నా దేశ భద్రత ఎన్నికల అంశం కాదని మహాకూటమి నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బిహార్ పాలిగంజ్ బహిరంగ సభ వేదికగా ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మోదీ.

ఎన్నికల సందర్భంగా బిహార్​లో తన చివరి బహిరంగ సభ ఇదేనని ఒకింత భావోద్వేగంతో వ్యాఖ్యానించారు మోదీ. తిరిగి అధికారం చేపట్టాక అభివృద్ధి పథకాలతో ప్రజల ముందుకు వస్తానని ఉద్ఘాటించారు.

విపక్షాలు వర్గ రాజకీయాలతో అధికారంలోకి రావలనుకుంటున్నాయని కాంగ్రెస్, ఆర్జేడీల కూటమిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోదీ.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ లైవ్​ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!

Last Updated : May 15, 2019, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details