తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీలకు ప్రధాని మోదీ విందు

అన్ని పార్టీల ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. దిల్లీలోని ఆశోకా హోటల్​లో ఈ కార్యక్రమం జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా నూతనంగా ఎన్నికైన లోక్​సభ స్పీకర్​ హాజరయ్యారు. కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ గైర్హాజరు కాగా గులాంనబీ వచ్చారు.

By

Published : Jun 20, 2019, 11:14 PM IST

ఎంపీలకు ప్రధాని మోదీ విందు

అన్ని రాజకీయ పార్టీల లోక్​సభ, రాజ్యసభ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విందునిచ్చారు. దిల్లీలోని అశోక​ హోటల్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, మాజీ స్పీకర్​ సుమిత్రా మహాజన్ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, సమాజ్​వాదీ అధ్యక్షుడు అఖిలేశ్​ లాంటి కొందరు ప్రముఖ నేతలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హస్తం పార్టీ తరఫున రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్​ పాల్గొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఆమ్​ఆద్మీ నుంచి సంజయ్​ సింగ్​, తెదేపా నుంచి భాజపాలో ఈరోజే చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్​, టీజీ వెంకటేశ్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.

లోక్​సభ మాజీ స్పీకర్​ సుమిత్రా మహాజన్​ సేవలను కార్యక్రమంలో ప్రధాని మోదీ గుర్తు చేశారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మోదీతో సెల్ఫీలు దిగారని భాజపా నేత రాజీవ్​ ప్రతాప్​ రూఢీ చెప్పారు. విందులో తినేందుకు అన్ని శాఖాహార పదార్థాలనే ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details