తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆచితూచి వ్యవహరిస్తోన్న ఎస్పీ, బీఎస్పీ..!

ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాల్లో దాదాపు అన్ని సర్వే సంస్థలు భాజపాకే పట్టం కట్టిన వేళ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశం అయ్యారు. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఎన్​డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాల తరుణంలో మే23 తర్వాతే జాతీయ రాజకీయాలపై మాయావతి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

By

Published : May 20, 2019, 6:39 PM IST

Updated : May 20, 2019, 9:14 PM IST

ఆచితూచి వ్యవహరిస్తోన్న ఎస్పీ, బీఎస్పీ..!

ఆచితూచి వ్యవహరిస్తోన్న ఎస్పీ, బీఎస్పీ..!

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల్లో ఎన్​డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలింది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ మహాకూటమి ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్,​ బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశం అయ్యారు. లఖ్‌నవూలోని మాయావతి నివాసానికి వెళ్లిన అఖిలేశ్ సుమారు గంటసేపు మంతనాలు జరిపారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. దాదాపు అన్ని సర్వే సంస్థలు భాజపాకు అనుకూల ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడితో నిన్న విడివిడిగా సమావేశం అయిన ఇరువురు నేతలు కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే భాజపాయేతర పక్షాలతో అధికారంలోకి రావడానికి గల అవకాశాలను చర్చించారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ 38, ఎస్పీ 37 స్థానాల్లో కలిసి పోటీ చేయగా మరో మూడు స్థానాలను మిత్రపక్షం ఆర్​ఎల్​డీకి కేటాయించారు.

గట్టిపోటీ...

ఉత్తరప్రదేశ్​లో గత పార్లమెంటు ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 71 గెలిచింది కమలం పార్టీ. అయితే ఈసారి మహాకూటమితో గట్టిపోటి ఎదుర్కోనున్నట్లు ఎగ్జిట్​ పోల్స్​ తేల్చాయి. కొన్ని సంస్థలు మహాకూటమి స్వల్ప తేడాతో పై చేయి సాధిస్తుందని పేర్కొన్నాయి. మరి కొన్ని కమలం ముందంజలో ఉంటుందని తేల్చాయి. ఏది ఏమైనా కాషాయ పార్టీ కొన్ని స్థానాలు కోల్పోనుండటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో మహాకూటమి నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆచితూచి వ్యవహరిద్దాం..!

ఎగ్జిట్ పోల్స్​ అంచనాలతో మహాకూటమి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 55 స్థానాలను పక్కాగా గెలుస్తామని కూటమి ధీమాగా ఉంది. అయితే 60 సీట్ల వరకు గెలిచే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో మాయావతి మాత్రం పార్టీ నాయకులను జిల్లాల్లోనే ఉండి లెక్కింపు ప్రక్రియపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Last Updated : May 20, 2019, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details