తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో మరోమారు నక్సలైట్ల విధ్వంసకాండ

ఒడిశాలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. మల్కన్​గిరి జిల్లా తేమూరుపాలి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

By

Published : May 18, 2019, 4:44 PM IST

Updated : May 18, 2019, 6:14 PM IST

ఒడిశాలో మరోమారు నక్సలైట్ల విధ్వంసకాండ

ఒడిశాలో మరోమారు నక్సలైట్ల విధ్వంసకాండ

ఒడిశా మల్కన్​గిరి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. మాతిలి పోలీసు స్టేషన్​ పరిధిలోని తేమూరుపాలి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బాంబులు పెట్టి కూల్చేశారు.

ధ్వంసమైన పంచాయతి కార్యాలయం

దంతెవాడలో పోలీసు దమనఖాండకు నిరసనగా ఈ విధ్వంసానికి పాల్పడినట్లు చెబుతూ మావోయిస్టులు అక్కడ కరపత్రాలు విడిచివెళ్లారు.

మావోయిస్టుల కరపత్రాలు

శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో సుమారు 30 నుంచి 40 మంది మావోయిస్టులు పాల్గొని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర

Last Updated : May 18, 2019, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details