తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ప్రధానికి సెలవులు మంజూరు.. కారణం ఇదేనా?

అనారోగ్యం కారణంగా మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​కు సెలవులు మంజూరు చేసింది రాజ్యసభ. ఈ విషయాన్ని పెద్దలసభలో సోమవారం వెల్లడించారు ఛైర్మన్​ ఎం. వెంకయ్యనాయుడు.

By

Published : Mar 23, 2020, 4:35 PM IST

Manmohan seeks leave from Rajya Sabha citing ill health
మాజీ ప్రధానికి సెలవులు మంజూరు.. కారణం ఏంటంటే?

అనారోగ్యం కారణంగా తాను రాజ్యసభకు హాజరుకాలేనని సెలవులు మంజూరు చేయాలని కోరుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ ఎగువసభకు లేఖ రాశారు. ఆయన లేఖను సభ ఆమోదించినట్లు ప్రకటించి... సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.

"అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేనని సెలవులు మంజూరు చేయాలని మన్మోహన్ సింగ్​ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు."

-ఎం. వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్​

ఇదిలా ఉంటే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఎగువ సభను నిరవధికవాయిదా వేయనున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఇదీ చదవండి:కరోనా భయంతో విమానం నుంచి కిందకు దూకిన పైలట్

ABOUT THE AUTHOR

...view details