తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జైలుకైనా వెళ్తా... అలా మాత్రం జరగనివ్వను'

సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునఃస్థాపించారు. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల భవిష్యత్​ను నిర్ణయించాలని భాజపా భావిస్తే... చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు మమత.

By

Published : Jun 11, 2019, 5:17 PM IST

Updated : Jun 11, 2019, 6:32 PM IST

మమత నేతృత్వంలో చంద్ర విద్యాసాగర్ విగ్రహావిష్కరణ

'జైలుకైనా వెళ్తా... అలా మాత్రం జరగనివ్వను'

బంగాల్​ను గుజరాత్​లా మార్చాలని భాజపా కుట్ర పన్నుతోందని ఆరోపించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలా ఎప్పటికీ జరగనివ్వనని తేల్చిచెప్పారు. అవసరమైతే జైలుకెనా వెళ్తానని స్పష్టంచేశారు.

కోల్​కతాలో భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లలో ధ్వంసమైన సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ విగ్రహాన్ని పునఃస్థాపించారు మమత. విద్యాసాగర్​ కళాశాలలో పూర్వం ఉన్నటువంటి విగ్రహంతోపాటు 8 అడుగుల 5 అంగుళాల ప్రతిమను విద్యాసంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

రాష్ట్రాల మనోభావాలతో భాజపా ఆడుకుంటోందని ఆరోపించారు మమత.

"మేం అందరినీ గౌరవిస్తాం. బంగాలీ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయకూడదు. భారత్​లో ప్రతి రాష్ట్రం తమదైన చరిత్ర, భాష, ప్రాథమ్యాలు కలిగి ఉంది. ఐక్యమత్యంతో ఉన్న అతిపెద్ద దేశం భారత్. ఇక్కడ చాలా రకాల భాషలు, విధానాలు ఉన్నాయి. అందుకే మనం సారే జహాసే అచ్చా అని అంటుంటాం. కానీ భాజపా... రాష్ట్రాల భవిష్యత్​ను నిర్ణయించాలనుకోవడం సరికాదు. ప్రతి రాష్ట్రానికి ఆత్మగౌరవం ఉంటుంది."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి


ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లలో రాష్ట్రంలో పదిమంది మృతి చెందారని వెల్లడించారు మమత. వారిలో 8 మంది టీఎంసీకి, ఇద్దరు భాజపాకు చెందినవారని చెప్పారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు బంగాల్​ ముఖ్యమంత్రి.

ఇవీ చూడండి: 'విద్యాసాగర్' కేసుపై విచారణ కమిటీ నియామకం

విగ్రహం కూల్చివేత భాజపా పనే: టీఎంసీ

Last Updated : Jun 11, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details