తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అగ్నిప్రమాదం... మెట్రో సేవలు నిలిపివేత

దిల్లీలోని ఫర్నీచర్​ మార్కెట్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు, దట్టమైన పొగ ఎగసిపడుతున్న కారణంగా అక్కడ తాత్కాలికంగా మెట్రో సేవలు నిలిపివేశారు అధికారులు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

By

Published : Jun 21, 2019, 12:06 PM IST

దిల్లీలో అగ్నిప్రమాదం... మెట్రో సేవలు నిలిపివేత

దిల్లీలో అగ్నిప్రమాదం... మెట్రో సేవలు నిలిపివేత

దిల్లీ కలిండి కుంజ్ రైల్వే స్టేషన్​ సమీపంలోని ఫర్నీచర్ మార్కెట్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మెట్రో రైలు సేవలను అధికారులు నిలిపివేశారు.

ఉదయం ఆరు గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.

ఎగసిపడుతున్న జ్వాలలు, పొగ కారణంగా ప్రస్తుతం జశోలా విహార్ షహీన్ నుంచి కలిండి కుంజ్​ మధ్య దిల్లీ మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం మెట్రో ట్రాక్ పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి: 173కు చేరిన 'మెదడువాపు' మృతులు

ABOUT THE AUTHOR

...view details