తెలంగాణ

telangana

త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

By

Published : Oct 30, 2019, 5:45 PM IST

త్వరలోనే మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. 'ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం' అంటూ వచ్చే వార్తలన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ప్రత్యామ్నాయ కూటమి వార్తలు కేవలం వినోదానికేనని స్పష్టం చేశారు.

త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. నేడు రెండోసారి శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఆయన.. మహాకూటమి నేతృత్వంలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఐదు సంవత్సరాల్లో చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని మిత్రపక్షం శివసేన పట్టుపడుతోన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఫడణవీస్.

"మహారాష్ట్ర ఓటర్లు భాజపా-శివసేన సభ్యులుగా ఉన్న మహాకూటమికి పట్టంకట్టారు. ఈ నేపథ్యంలోనే మహాకూటమి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రత్యామ్నయ మార్గంలో ప్రభుత్వ ఏర్పాటుపై పలు వదంతులు వస్తున్నాయి. అవి వినోదం కోసం మాత్రమే పనికొస్తాయి."

-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

1995 అనంతర ఎన్నికల్లో ఏ పార్టీకీ 75 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు రాలేదని గుర్తుచేశారు ఫడణవీస్. 288 సీట్లున్న అసెంబ్లీలో భాజపా 2014లో 122, తాజాగా 105 స్థానాలతో జనహృదయాన్ని గెలుచుకుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: మహా భాజపా శాసనసభాపక్ష నేతగా మరోసారి ఫడణవీస్

ABOUT THE AUTHOR

...view details