తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాగ్దానాలు మరిచిన 'మంత్రిని నిలదీసిన మహిళ'

మధ్యప్రదేశ్​ మంత్రి సుఖ్​దేవ్​ పాన్సేకు చేదు అనుభవం ఎదురైంది. బేతుల్​ జిల్లా జౌల్ఖేరా గ్రామంలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయనను 'ఆశ' అనే మహిళ నిలదీసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతు రుణమాఫీ, మద్యపానం నిషేధం వంటి వాగ్దానాలను కాంగ్రెస్​ పార్టీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

By

Published : Jan 29, 2020, 5:39 AM IST

Updated : Feb 28, 2020, 8:42 AM IST

Madhya Pradesh woman confronts state minister
వాగ్దానాలు మరిచిన మంత్రిని నిలదీసిన మహిళ

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయిన ఓ నేతను పదిమంది ముందు ఓ మహిళ నిలదీసిన ఘటన మధ్యప్రదేశ్​ బేతుల్​ జిల్లా జౌల్ఖేరా గ్రామంలో జరిగింది.
కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి సుఖ్​దేవ్​ పాన్సే జౌల్ఖేరా గ్రామంలో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఆశ అనే మహిళ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేసిందని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

"రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 80 శాతం మంది మహిళలు సంతకాలు చేసిన గ్రామాల్లో మద్యపానం నిషేధిస్తామని కూడా వాగ్దానం చేసింది. అయితే ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటుచేసినా.. నేతలు మాత్రం ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేస్తున్నారు." - ఆశ, జౌల్ఖేరా గ్రామ మహిళ

సమయం పడుతుంది..!

ఆశ ఆవేదన విన్న మంత్రి పాన్సే... పథకాలు అమలు చేయడానికి సమయం పడుతుందని, రుణాలు మాఫీ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమెకు హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటివరకు రుణమాఫీ చేసిన రైతుల జాబితాను ఆశకు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

"ఒక పథకాన్ని ప్రకటించిన తరువాత అమలు చేయడానికి సమయం పడుతుంది. ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. మీ (ప్రజల) డిమాండ్లు నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి రుణాలు మాఫీ చేసిన వ్యక్తుల జాబితాను ఆమెకు ఇవ్వండి. ఫలితంగా ఆమె ఏమి జరిగిందో తెలుసుకుంటుంది. మాట్లాడటం చాలా సులభం."
- సుఖ్​దేవ్ పాన్సే, మధ్యప్రదేశ్​ మంత్రి

నాషా-ముక్త్​ మధ్యప్రదేశ్​

'నాషా-ముక్త్'​ (మద్యం లేని) మధ్యప్రదేశ్ కావాలని మంత్రి సుఖ్​దేవ్​ని కోరింది ఆశ.

"మా గ్రామంలో మద్యం దుకాణాలు మూసివేయాలి. 8,9వ తరగతి విద్యార్థులు కూడా మద్యం సేవిస్తున్నారు. నేను కలెక్టర్​, ఏడీఎం, తహసీల్దారుకు ఫిర్యాదు చేశాను. కానీ ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు స్వయంగా మీకే నా దరఖాస్తును సమర్పిస్తున్నాను. మధ్యప్రదేశ్​ మద్యపాన రహితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను."- ఆశ, జౌల్ఖేరా గ్రామ మహిళ

ఇదీ చూడండి:ఒక దీవి.. ఓ మహిళ... 31 మంది సైనికులు

Last Updated : Feb 28, 2020, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details