తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పూర్​ నడవా నిర్మాణానికి ఆటంకం!

భారత్​, పాకిస్థాన్​ మధ్య నిర్మిస్తున్న కర్తార్​పూర్​ నడవా విషయమై ఇరుదేశాల నిపుణులు సోమవారం సమావేశం అయ్యారు. అయితే రావి నదిపై వంతెన నిర్మించాలా లేదా రోడ్డు వేయాలా అనే అంశంలో అభిప్రాయ బేధాలు వచ్చాయి. తదుపరి సమావేశంపైనా సందిగ్ధం ఏర్పడింది.

By

Published : May 28, 2019, 4:03 PM IST

కర్తార్​పూర్​ నడవా నిర్మాణానికి ఆటంకం!

భారత్, పాకిస్థాన్​ మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కర్తార్​పూర్​ నడవా విషయంలో తాజాగా ఓ అడ్డంకి ఏర్పడింది. రావి నదిపై వంతెన​ నిర్మించాలా లేదా రోడ్డు వేయాలా అనే అంశంలో ఇరుదేశాల నిపుణుల మధ్య తలెత్తిన బేధాభిప్రాయాలే ఇందుకు కారణం.

కర్తార్​పూర్ జీరో పాయింట్​ వద్ద నడవా​ నిర్మాణ విధివిధానాలు చర్చించడానికి సోమవారం పాకిస్థాన్​, భారత్​ నిపుణులు సమావేశమయ్యారు. ఓ గంటపాటు జరిగిన ఈ భేటీలో కారిడార్​ నిర్మాణ పనుల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.

వంతెనా? రోడ్డా?

రావి నదిపై తరచూ ఉద్ధృతంగా వరదలు వస్తుంటాయి కనుక ఓ కిలోమీటర్​ పొడవైన వంతెన నిర్మించాలని భారత నిపుణులు ప్రతిపాదించారు. అయితే రహదారి నిర్మిస్తే సరిపోతుందని పాక్​ నిపుణులు అభిప్రాయపడ్డారు. రహదారి వంపు అధికంగా ఉంచడం వల్ల వరద మప్పును సమర్థంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. ఈ విషయంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. తదుపరి సమావేశం తేదీపైనా దాయాది దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

ఇదీ విషయం..

సిక్కులకు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో... పాకిస్థాన్​ కర్తార్​పూర్​లోని గురుద్వారా దర్బార్​ సాహెబ్​ ఒకటి కాగా, మరొకటి (భారత్) పంజాబ్​ గురుదాస్​పుర్​లోని డేరాబాబా నానక్​ మందిరం. ఈ రెండు సిక్కు పవిత్ర క్షేత్రాలను అనుసంధానం చేసేదే కర్తార్​పూర్ నడవా.

2018 నవంబర్​లో కర్తార్​పూర్​ నడవా నిర్మాణం చేపట్టాలని భారత్​, పాక్​ నిర్ణాయానికి వచ్చాయి.

గురునానక్​ జయంతికి పూర్తయ్యేనా...?

సిక్కుల మత గురువు గురునానక్​ 550వ జయంతోత్సవాలు నవంబర్​లో జరగనున్నాయి. అప్పటికల్లా ఈ కర్తార్​పూర్ నడవా నిర్మాణం పూర్తి చేయాలని పాక్​ చెబుతోంది. ఇది పూర్తయితే ఇరుదేశాల సిక్కులకు వీసాలేకుండానే తమ పవిత్ర క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

ఇదీ చూడండి: అప్పుడు నెహ్రూ, రాజీవ్​... ఇప్పుడు మోదీ: రజనీ

ABOUT THE AUTHOR

...view details