తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2019, 12:18 PM IST

Updated : Aug 5, 2019, 1:15 PM IST

ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్: సైన్యం, వాయుసేన హైఅలర్ట్​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్​ 370, ప్రత్యేక హక్కులు ఇస్తున్న ఆర్టికల్​ 35ఏను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అడుగడుగునా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

కశ్మీర్​లో ఉద్రిక్తత.. బలగాల అధీనంలో రాష్ట్రం

ఆర్టికల్​ 370, ఆర్టికల్​ 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమైన సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

ఏ చిన్న అవాంఛనీయ ఘటనకు తావివ్వకుండా పహారా కాస్తున్నాయి బలగాలు. రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి... ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

కశ్మీర్​లో ఉద్రిక్తత.. బలగాల అధీనంలో రాష్ట్రం

ఇప్పటికే జమ్ము, శ్రీనగర్​ పరిధిలో 144 సెక్షన్​ అమలులో ఉంది. ప్రముఖ రాజకీయ నేతలకు గృహ నిర్బంధం విధించారు.

మరిన్ని బలగాలు...

జమ్ముకశ్మీర్​కు కేంద్రం మరిన్ని బలగాలను తరలిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశా, అసోం సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పారామిలటరీ దళాలకు చెందిన 8 వేల మందిని కశ్మీర్​కు వాయుమార్గంలో పంపుతోంది.

హైఅలర్ట్​...

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యం, వాయుసేనకు సూచించింది కేంద్రం.

Last Updated : Aug 5, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details