తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిగంబోధ్​ ఘాట్​లో అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు

అనారోగ్యంతో అరుణ్​ జైట్లీ తుదిశ్వాస విడిచారు. దిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రి నుంచి స్వగృహానికి జైట్లీ పార్థివదేహాన్ని కాసేపట్లో తరలించనున్నారు. ఆదివారం నిగంబోధ్​ ఘాట్​ వద్ద కేంద్ర మాజీ మంత్రి అంత్యక్రియలు జరగనున్నాయి.

By

Published : Aug 24, 2019, 3:29 PM IST

Updated : Sep 28, 2019, 2:59 AM IST

నిగంబోధ్​ ఘాట్​లో అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం దిల్లీలోని నిగంబోధ్​ ఘాట్​లో జరగనున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న జైట్లీ... శనివారం 12 గంటల 7 నిమిషాలకు కన్నుమూశారు.

66 ఏళ్ల జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్​ నుంచి కైలాశ్​ కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహాన్ని దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. భాజపా సహా వివిధ పార్టీల నేతలు, అభిమానులు జైట్లీని కడసారి చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం నిగంబోధ్​ ఘట్​లో అంత్యక్రియలు చేయనున్నారు.

ఇదీ చూడండి:- మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ ​జైట్లీ అస్తమయం

Last Updated : Sep 28, 2019, 2:59 AM IST

ABOUT THE AUTHOR

...view details