తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రక్షణ రంగ బలోపేతమే ప్రథమం'

దేశ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ స్పష్టం చేశారు. దానికి అనుగుణగా రక్షణ రంగంలో సదుపాయాల లోటును పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.

By

Published : Mar 16, 2019, 6:45 AM IST

రక్షణ రంగ బలోపేతానికి కృషి అని జైట్లీ ప్రకటన

రక్షణ రంగ బలోపేతమే ప్రభుత్వ ప్రాథమ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ తెలిపారు. దిల్లీ వేదికగా జరిగిన వ్యాపార సదస్సులో జైట్లీ పలు విషయాలపై ప్రసంగించారు. రక్షణ రంగంలోని లోటుపాట్లను పూడ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

భద్రత అనంతరం గ్రామీణాభివృద్ధి, మెరుగైన ఆరోగ్య వసతుల కల్పన, విద్యా వ్యవస్థల సంస్కరణలపై పాటుపడుతామని వివరించారు. పన్ను రేట్లను తగ్గిస్తేనే వసూళ్లలో పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులు తగ్గిస్తూ వస్తున్నామన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకంతో ఇప్పటికే 16 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు జైట్లీ. దేశవ్యాప్తంగా 78 శాతం ప్రజలు ఆరోగ్య బీమాకు అర్హులైనట్టు విశదీకరించారు.

ఇదీ చూడండి: భారత్​-అమెరికాల 'అణు'బంధం

ABOUT THE AUTHOR

...view details