తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2019, 10:25 AM IST

Updated : Apr 16, 2019, 3:27 PM IST

ETV Bharat / bharat

జేడీఎస్​ నేతల నివాసాలపై ఐటీ దాడులు

కర్ణాటకలో జేడీఎస్​ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మండ్య జిల్లా పరిషత్​ అధ్యక్షుడు నాగరత్న స్వామితో పాటు మరో నాయకుడి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.

జేడీఎస్​ నేతల నివాసాలపై ఐటీ దాడులు

కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మండ్య జిల్లా పరిషత్​ అధ్యక్షుడు, జేడీఎస్​ నేత నాగరత్న స్వామికి చెందిన రెండు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ సభ్యుడైన ఆదే పార్టీకి చెందిన మరో నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

మండ్య లోక్​సభ స్థానం నుంచి జేడీఎస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్​ గౌడ. నటి సుమలత నిఖిల్​కు ప్రత్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలతకు భాజపా మద్దతిస్తోంది.

కక్షపూరితంగా కేంద్రంపై తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని ఇటీవలే సీఎం కుమారస్వామి ధర్నాకు దిగారు. ఈ అంశంపై జేడీఎస్​-కాంగ్రెస్​, భాజపా నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.

Last Updated : Apr 16, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details