తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే: పర్యటకులకు భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ

భారతీయ రైల్వే ప్రత్యేకంగా 'భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ'ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ సెప్టెంబర్​ 27 నుంచి ప్రారంభమవుతుంది. పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీజీ జన్మస్థలమైన పోర్​బందర్, సబర్మతి ఆశ్రమం, సర్ధార్ వల్లభాయ్ పటేల్​ ఐక్యతా విగ్రహాలను దర్శించవచ్చు.

By

Published : Sep 18, 2019, 7:52 AM IST

Updated : Oct 1, 2019, 12:43 AM IST

రైల్వే: పర్యటకులకు భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ

మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రదేశాలతో పాటు గుజరాత్​, మధ్యప్రదేశ్​ల్లోని పర్యాటక ప్రాంతాలకు కలిపి ఐఆర్​సీటీసీ భారత్​ దర్శన్​ టూరిస్ట్​ ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ సెప్టెంబర్​ 27 నుంచి ప్రారంభమవుతుందని రైల్వే పర్యటక, క్యాటరింగ్​శాఖ తెలిపింది.

ఈ టూరిస్టు ప్యాకేజీ ద్వారా.. గాంధీజీ జన్మస్థలమైన పోర్​బందర్​, అహ్మదాబాద్​లోని సబర్మతి ఆశ్రమాన్ని దర్శించవచ్చు. అలాగే వడోదరలోని ప్రపంచంలోనే అతి ఎత్తైన వల్లభాయ్​ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించవచ్చు.

పర్యటన ఇలా..

ఈ పర్యటన ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు కొనసాగుతుంది. మధ్యప్రదేశ్​లోని రేవా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ఇండోర్​ (ఓంకారేశ్వర్​), ఉజ్జయిని (మహా కాళేశ్వర్​), అహ్మదాబాద్​, ద్వారక, పోర్​బందర్​, సోమనాథ్​గా సాగి చివరకు వడోదర (ఐక్యతా విగ్రహం) వద్ద ముగుస్తుంది.

మార్గమిలా..

రేవా-సత్నా- మైహార్​- కట్ని- జబల్పూర్​- నర్సింగ్​పూర్​- పిపారియా- ఇటార్సి- హోషంగాబాద్​- హబీబ్​గంజ్​- సెహోర్​- షుజల్​పూర్​- మక్సీ- దేవాస్​- ఇండోర్- ఉజ్జయిని- అహ్మదాబాద్- ద్వారకా- పోర్​బందర్​- సోమనాథ్​-వడోదర.... ఇది పూర్తయిన తరువాత తిరుగు విహారయాత్ర కొనసాగుతుంది.

అందుబాటు ధరలో...

ఈ పర్యాటక ప్యాకేజీలో స్లీపర్ క్లాస్​లో ఒక్కో వ్యక్తికి రూ.8,505 ఉంటుంది. థర్డ్​ ఏసీకి అయితే రూ.10,395లు ఉంటుంది. పర్యటకులకు ప్రత్యేక గది, స్వచ్ఛమైన శాఖాహార భోజనం, పర్యటక ప్రదేశాలను దర్శించడానికి బస్సులు, భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.

ఇదీ చూడండి:అక్టోబర్​ 2న సబర్మతీ ఆశ్రమానికి ప్రధాని మోదీ!

Last Updated : Oct 1, 2019, 12:43 AM IST

ABOUT THE AUTHOR

...view details