తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ ప్రశ్నల వర్షానికి స్పందించని చిదంబరం

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత చిదంబరాన్ని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటలపాటు విచారించారు. అయితే ఆయన కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పడం లేదా మౌనం వహించారని... విచారణకు సహకరించలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

By

Published : Aug 22, 2019, 3:35 PM IST

Updated : Sep 27, 2019, 9:27 PM IST

సీబీఐ ప్రశ్నల వర్షానికి ... స్పందించని చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్ట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు దాదాపు 3 గంటలపాటు విచారించారు. చిదంబరం అధికారుల ప్రశ్నలకు ముక్తసరి సమాధానాలు చెప్పడం లేదా మౌనం వహించారని... విచారణకు సహకరించలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

విచారణ సందర్భంగా... చిదంబరాన్ని సీబీఐ అడిగిన ప్రశ్నలు...

  • ఐఎన్ఎక్స్ మీడియాకు మీకు ఉన్న సంబంధం ఏమిటి?
  • ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలను ఎన్ని సార్లు కలిసారు? వారికి మీకు ఉన్న సంబంధాలేమిటి?
  • వారితో కలిసిన సందర్భంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలపై చర్చించారా?
  • ఐఎన్ఎక్స్ మీడియా అంశంపై మీ వద్ద చర్చ జరిగినప్పుడు ఎవరెవరు హాజరయ్యారు?
  • ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలను.. కార్తీ చిదంబరంను కలవమని చెప్పారా?
  • మీకు ఎన్ని బ్యాంక్ ఖాతాలున్నాయి? ఎక్కడెక్కడున్నాయి?
  • మీ కుమారుని కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలని అడిగారా? ఎంత పెట్టుబడి పెట్టమని అడిగారు?

అయితే చిదంబరం సరిగ్గా స్పందించలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి.

కస్టడీకి కోరే అవకాశం

చిదంబరాన్ని ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో మరింత సమాచారం సేకరించేందుకు ఆయనను సీబీఐ కస్టడీకి అప్పగించమని న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది.

ఈడీ కూడా

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ కూడా చిదంబరంను అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇన్నాళ్లూ ఐఎన్​ఎక్స్ మీడియా కేసును దర్యాప్తు చేస్తున్న రాకేశ్​ అహుజాను తప్పించి.. మాతృసంస్థకు బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చూడండి: అయోధ్య కేసు: 'ఆరాధన హక్కుని నియంత్రించరాదు'

Last Updated : Sep 27, 2019, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details