తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు ప్రధాని. అనేక మంది ప్రముఖులు, ప్రజల సమక్షంలో మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. అంతకుముందు రాజ్​ఘాట్​లో మహాత్ముడికి నివాళులర్పించారు మోదీ.

By

Published : Aug 15, 2019, 8:00 AM IST

Updated : Sep 27, 2019, 1:50 AM IST

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు- మోదీ వందనం

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు- మోదీ వందనం
ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వేలాది మంది సమక్షంలో త్రివర్ణ జెండాకు గౌరవ వందనం చేశారు మోదీ.

అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజనాథ్​ సింగ్​ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోటపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తాజాగా ఈ రికార్డును మోదీ సమం చేశారు.


ఇదీ చూడండి
: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుది
ట్టం

Last Updated : Sep 27, 2019, 1:50 AM IST

ABOUT THE AUTHOR

...view details