తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​-చైనా సరిహద్దులో అంతా ప్రశాంతం'

సరిహద్దులో భారత్​, చైనా మధ్య ఎలాంటి విభేదాలు లేవని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సరిహద్దులో శాంతికి కృషి చేస్తున్నామని లోక్​సభలో తెలిపారు.

By

Published : Jul 17, 2019, 4:40 PM IST

Updated : Jul 17, 2019, 5:03 PM IST

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

భారత్​, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ సరిహద్దులో శాంతి, సామరస్యానికి కృషి చేస్తున్నాయని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. 2017లో డోక్లాం ఉద్రిక్తతలు ముగిసిన తర్వాత రెండు దేశాల సైన్యాలు పూర్తి సంయమనం పాటిస్తున్నాయని తెలిపారు.

సరిహద్దుల్లో సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని లోక్​సభలో విపక్షాలు చేసిన ఆరోపణలకు మంత్రి సమాధానమిచ్చారు.

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

"భారత్​, చైనా మధ్య ప్రాదేశిక శాంతి ఉంది. వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని విభేదాల వల్ల గతంలో కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. 2018 ఏప్రిల్​లో​ వుహాన్​ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ మధ్య భేటీ జరిగింది. సరిహద్దుల వద్ద శాంతి, సామరస్యం నెలకొల్పాలని ఆ భేటీలో తీర్మానించారు. అప్పటి నుంచి రెండు దేశాల సైన్యానికి వ్యూహాత్మక అంశాలనూ నిర్దేశించారు. ఈ విధంగా సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దేశ రక్షణ విషయంలో భారత ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

ఇదీ చూడండి: 'రాజీనామాపై వెనక్కి తగ్గం- పరీక్షకు హాజరుకాం'

Last Updated : Jul 17, 2019, 5:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details