తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ను ముంచెత్తిన భారీ వర్షాలు- 13 మంది మృతి

భారీ వర్షాలకు బిహార్​లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా పట్నా, భగల్​పుర్​, కైముర్​ జిల్లాల్లో సుమారు 13 మంది మృతి చెందారు. వందల మంది నిరాశ్రయులయ్యారు.

By

Published : Sep 29, 2019, 4:25 PM IST

Updated : Oct 2, 2019, 11:31 AM IST

బిహార్​ను ముంచెత్తిన భారీ వర్షాలు

బిహార్​ను ముంచెత్తిన భారీ వర్షాలు

బిహార్​ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భవనాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. రవణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తూర్పు మధ్య రైల్వే 30 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

భారీ వర్షాల కారణంగా పట్నా, భగల్​పుర్​, కైముర్​ జిల్లాల్లో 13 మంది మృతి చెందారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. భగల్​పుర్​లో బరారీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ఆలయం ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. పట్నా దనపుర్​ ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఆటోపై భారీ వృక్షం పడి ఏడాది పాపతో పాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కైముర్​లోని భభువాలో రెండు ఇళ్లు కూలిపోయి ముగ్గురు మృతి చెందారు.

రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

రాష్ట్ర రాజధాని పట్నాలో శుక్రవారం నుంచి 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది.

'అండగా ఉంటాం..'

వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా ఉంటామని బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శిబిరాలను ఏర్పాటు చేసి ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'అధికరణ 370 రద్దుకు యావత్ ప్రపంచం మద్దతు'

Last Updated : Oct 2, 2019, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details