తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ వదిలి అమర్​నాథ్​ యాత్రికులు వెళ్లిపోవాలి'

ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అమర్​నాథ్​ యాత్రికులను వెనుదిరగాలని కశ్మీర్​ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

By

Published : Aug 2, 2019, 5:54 PM IST

Updated : Aug 2, 2019, 7:00 PM IST

అమర్​నాథ్

అమర్​నాథ్​ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక

వీలైనంత తొందరగా జమ్ము కశ్మీర్​ లోయను వదిలి వెళ్లాలని అమర్​నాథ్​ యాత్రికులను హెచ్చిరించింది ఆ రాష్ట్ర హోంశాఖ. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం అందిన నేపథ్యంలో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది కశ్మీర్​ ప్రభుత్వం.

ప్రభుత్వ ఆర్డర్​

యాత్రికులే లక్ష్యంగా తీవ్రవాదులు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు నివేదికలు వచ్చాయని హోంశాఖ తెలిపింది. యాత్రికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి వారి యాత్రా నివాసాలను ఖాళీ చేయాలని సూచించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.

అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్​ సైన్యం, ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని సైన్యం ఉన్నతాధికారులు హెచ్చరించిన కొద్ది సేపటికే కశ్మీర్​ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్ సైన్యం​ కుట్ర

Last Updated : Aug 2, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details