తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.50 కోసం భార్యను కడతేర్చిన భర్త

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. భిలాయ్​ కంటోన్మెంట్​ ప్రాంతంలో రూ. 50 కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో కిరాతక భర్త. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు.

By

Published : Jan 10, 2021, 1:24 PM IST

Husband killed his wife for Rs.50 at Bhilai Cantonment in Chhattisgarh
రూ.50 కోసం కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

మద్యానికి బానిసైన ఓ భర్త, అతడి భార్య మధ్య తలెత్తిన వివాదం.. విషాదంగా ముగిసింది. ఛత్తీస్​గఢ్​లోని భిలాయ్​ కంటోన్మెంట్​ ప్రాంతంలో రూ.50 ఇవ్వలేదని భార్యపై ఆగ్రహించిన భర్త.. ఆమెను ఇనుప రాడ్​తో కొట్టి చంపాడు. అనంతరం తానూ చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

ఇదీ జరిగింది..

రాజ్​కుమార్​ పటేల్​(40), అనితా పటేల్​(35) సుపేలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భిలాయ్​లో ఓ కిరాయి ఇంట్లో నివాసముంటున్నారు. ఇద్దరూ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. రాజ్​కుమార్​ కొద్దిరోజులుగా కూలీకి వెళ్లడం మానేసి.. మద్యానికి బానిసయ్యాడు. కొద్దిరోజులుగా మతిస్తిమితం సరిగా లేని అతడు.. రూ. 50 కోసం భార్యతో వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించగా.. ఇనుప రాడ్​తో తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమె.. అక్కడిక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు.

రక్తపు మడుగులో సంఘటనా స్థలం
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

అనంతరం తానూ.. చెయ్యి కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు రాజ్​కుమార్​. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ఈ పూర్తి వ్యవహారంపై భిలాయ్​ కంటోన్మెంట్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:టీకా పంపిణీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

ABOUT THE AUTHOR

...view details