తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​కు హోంమంత్రి అమిత్​ షా

రెండు రోజుల పర్యటన కోసం నేటి మధ్యాహ్నం జమ్ముకశ్మీర్​కు వెళ్లనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు అమర్​నాథ్​ యాత్ర భద్రతపై సమీక్షించనున్నారు.

By

Published : Jun 26, 2019, 9:35 AM IST

జమ్ముకశ్మీర్​కు హోంమంత్రి అమిత్​ షా

రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు దిల్లీ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. అమర్‌నాథ్ యాత్ర భద్రత, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సరిహద్దుల్లో పరిస్థితి, అంతర్గత భద్రతపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం... ఇటీవల మరణించిన పోలీసు అధికారులు, భాజపా కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు షా.

ఇదీ చూడండి:జైశంకర్​.. ఆ నలుగురిలో అత్యున్నత విద్యావంతుడు

ABOUT THE AUTHOR

...view details