తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2020, 6:48 PM IST

ETV Bharat / bharat

'దాడులకు భయపడం- మా గెలుపు తథ్యం'

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. మమతను ఓడించేందుకు దిల్లీ నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదని, ప్రజలే మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు. భాజపా అధ్యక్షుడు నడ్డాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

Home Minister Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు దిల్లీ నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రాష్ట్ర ప్రజలే మార్పు కోరుకుంటున్నారని, దీదీ ఆలోచనలను అంగీకరించరని పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాపై రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరు తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉండాలని భాజపా విశ్వసిస్తుందన్నారు.

బీర్భమ్​ జిల్లా బోల్​పుర్​లో రోడ్​ షో అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు షా. టీఎంసీ, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

" దాడులతో భాజపా ఆగిపోతుందనే తప్పుడు అభిప్రాయంలో ఉండకూడదని టీఎంసీ నాయకులందరికీ చెప్పాలనుకుంటున్నా. బంగాల్​లో రాజకీయ హింస తీవ్ర స్థాయిలో ఉంది. 300 మంది భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వారి మరణాలపై దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. మమతా బెనర్జీ.. రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను బంగాల్​ రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారు.

మమతా దీదీ.. మిమ్మల్ని ఓడించేందుకు దిల్లీ నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ కాంగ్రెస్​లో ఉన్నప్పుడు ఇందిరా గాంధీని బయట వ్యక్తిగా పిలిచారా? ఒక రాష్ట్రం ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లలేని దేశాన్ని మమత కోరుకుంటున్నారా? అటువంటి ఆలోచనలను బంగాల్​ ప్రజలు అంగీకరించరు. చొరబాట్లను టీఎంసీ నిలువరించలేదు. కానీ, భాజపా ఆ పని చేసింది. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ఇదీ చూడండి: 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు బంగాల్​ నిర్మిస్తాం'

ABOUT THE AUTHOR

...view details