తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్తత- ఎన్​ఐటీ మూసివేత

అమర్​నాథ్​ యాత్ర రద్దయిన అనంతరం జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు వేడెక్కాయి. శ్రీనగర్​లోని ఎన్​ఐటీకి నిరవధిక సెలవులు ప్రకటించారు. తదుపరి ఆదేశాల వరకు తరగతులు ఉండవని తెలిపారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించారు. వారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

By

Published : Aug 3, 2019, 7:18 AM IST

జమ్ములో ఉద్రిక్తత: ఎన్​ఐటీ మూసివేత

జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అమర్​నాథ్​ యాత్రికులను వెనుదిరగాలని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

తాజాగా భద్రతాపరమైన హెచ్చరికలతో కశ్మీర్​లో ఆందోళన నెలకొంది. శ్రీనగర్​ ఎన్​ఐటీకి నిరవధిక సెలవులు ప్రకటించింది యాజమాన్యం. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని ప్రకటించింది ఎన్​ఐటీ. ఇందుకోసం జమ్ముకశ్మీర్​ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

పాఠశాలలు మూసివేత?

కశ్మీర్​లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు మూసివేస్తున్నట్టు వార్తలు వ్యాపించాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటిచింది. పాఠశాలల మూసివేతపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

అదనపు సర్వీసులు...

అవసరమైతే అదనపు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్​ (డీజీసీఏ)​ కోరింది. అమర్​నాథ్​ యాత్రికుల తరలింపు కోసమూ ప్రత్యేక సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది.

తాజా పరిస్థుతుల నేపథ్యంలో ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది. నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు.

ఇదీ చూడండి:- ఉన్నావ్​ కేసులో పోలీసులకు లంచాలిచ్చే ప్రయత్నాలు!

ABOUT THE AUTHOR

...view details